కరోనా వేళ ఆవిరియంత్రం.. ఎలా పనిచేస్తోందో చూడండి..

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ పోలీసులు వినూత్న ఆవిరి యంత్రానికి శ్రీకారం చుట్టారు. వంటకు వినియోగించే కుక్కర్‌తో తేలికపాటి ఆవిరి యంత్రాన్ని రూపొందించారు. తొలుత కుక్కర్‌కు సన్నపాటి నీటి పైపును అమర్చిన పోలీసులు....

Published : 25 Apr 2021 12:43 IST

ఘజియాబాద్‌: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ పోలీసులు వినూత్న ఆవిరి యంత్రానికి శ్రీకారం చుట్టారు. వంటకు వినియోగించే కుక్కర్‌తో తేలికపాటి ఆవిరి యంత్రాన్ని రూపొందించారు. తొలుత కుక్కర్‌కు సన్నపాటి నీటి పైపును అమర్చిన పోలీసులు.. విజిల్‌ వచ్చిన ప్రతిసారీ పైపు ద్వారా ఆవిరి బయటకు విడుదలయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలా విజిల్‌ మోగిన ప్రతిసారీ ఆ పైపు ఎదురుగా నిలుచున్న వ్యక్తి ఆవిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఘజియాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని స్టేషన్లకూ విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఆ ఆవిరి యంత్రం ఎలా పనిచేస్తుందో చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని