Food: వాటిని సోషల్మీడియాలో పోస్టు చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. లావైపోతారు!
సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండేవారు.. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వివిధ సందర్భాల్లో ఫొటోలు, సెల్పీలు దిగి వాటిని పోస్టు చేస్తూ ఉంటారు. అలాంటి వారు మన చుట్టూ చాలా మందే కనిపిస్తారు. అయితే, తినే ఆహారాన్ని ఫొటోలు తీసి సోషల్మీడియాలో పోస్టు చేసే వారిలో ఆకలి తీవ్రత అధికంగా
ఇంటర్నెట్ డెస్క్: సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండేవారు.. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వివిధ సందర్భాల్లో ఫొటోలు, సెల్పీలు దిగి వాటిని పోస్టు చేస్తూ ఉంటారు. అలాంటి వారు మన చుట్టూ చాలా మందే కనిపిస్తారు. అయితే, తినే ఆహారాన్ని ఫొటోలు తీసి సోషల్మీడియాలో పోస్టు చేసే వారిలో ఆకలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అలా అధికంగా తింటూ ఊబకాయులుగా మారే అవకాశముందని తాజాగా జార్జియా యూనివర్సిటీ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.
21వ శతాబ్దంలో జన్మించిన వారిలో 70శాతం మంది.. వారు ఏం తింటున్నా.. వాటిని ఫొటో తీసి సోషల్మీడియాలో పోస్టు చేస్తున్నారట. అలా ఫొటోలు తీసి పోస్టు చేస్తూ తింటుండటంతో వడ్డించిన ఆహారం ఎంత బాగున్నా.. సరిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఫొటోల సంబరంలోపడి మొదటి సారి వడ్డించిన ఆహారంతో తృప్తి, తిన్న భావన కలుగక.. రెండోసారి వడ్డించుకుంటున్నారు. దీంతో బరువు పెరుగుతున్నారట. ఈ సర్వే కోసం యూనివర్సిటీ పరిశోధకులు కొంతమంది విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించి ఆహారం పెట్టారు. ఒక గ్రూపును కేవలం ఆహారం తినమని.. మరో గ్రూపును సోషల్మీడియాలో ఫొటోలు పెట్టి తినమని చెప్పారు. అనంతరం ఆహారం ఎంత రుచిగా ఉంది..? మరింత తినాలని ఉందా? అని ప్రశ్నించారు. మొదటి గ్రూపువారు కడుపు నిండిందని చెప్పగా.. రెండో గ్రూపు వ్యక్తులు మాత్రం మరింత తినాలనిపిస్తోందని చెప్పారు. తీసే ఫొటోల్లో ఆహారం ఆకర్షణీయంగా కనిపిస్తూ ఇంకా ఇంకా తినాలనిపించేలా చేస్తుందట. అలా మితంగా తినాల్సిన ఆహారం.. మితిమీరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. జాగ్రత్త పడకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు