AP PRC: సీఎం జగన్‌తో పీఆర్సీ సాధన సమితి నేతల భేటీ

ఏపీ సీఎం జగన్‌తో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు.

Published : 06 Feb 2022 13:19 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ల పరిష్కారానికి మంత్రుల కమిటీ హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఎంకు పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ కూడా పాల్గొన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం సీఎంతో భేటీకి దూరంగా ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని