Warangal: నాలుగు నెలల తర్వాత ప్రీతి హాస్టల్‌ గదిని తెరిచిన పోలీసులు

ఆత్మహత్య చేసుకున్న మెడికో విద్యార్థిని ప్రీతి హాస్టల్‌ గదిని పోలీసులు తెరిచారు. కుటుంబసభ్యులు, అధికారుల సమక్షంలో పోలీసులు గది లాక్‌ ఓపెన్‌ చేశారు.

Updated : 07 Jun 2023 19:38 IST

వరంగల్‌: సీనియర్‌ విద్యార్థి ర్యాగింగ్‌ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కాకతీయ మెడికల్‌ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి హాస్టల్‌ గదిని పోలీసులు బుధవారం తెరిచారు. కేఎంసీ హాస్టల్‌లో దాదాపు 4నెలలుగా మూసి ఉన్న రూమ్‌ నెంబర్‌ 409ని.. కుటుంబసభ్యులు, అధికారుల సమక్షంలో పోలీసులు లాక్‌ ఓపెన్‌ చేశారు. ఆ సమయంలో ప్రీతి వస్తువుల్ని చూసి ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రీతి లగేజీ ప్యాక్‌ చేసి అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రీతి హాస్టల్‌ గదిలో ఇంజెక్షన్లు, సూదులు, మెడికల్‌ కిట్స్‌ లభ్యమయ్యాయి. మరోవైపు ప్రీతి ఆత్మహత్య కేసులో వరంగల్‌ పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని