Hyderabad: దైవ దర్శనానికి వచ్చిన భక్తుడిపై పూజారి దాడి

సికింద్రాబాద్ గణపతి ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చిన భక్తుడిపై.. పూజారి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 07 Mar 2022 01:19 IST

సికింద్రాబాద్:  సికింద్రాబాద్ గణపతి ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చిన భక్తుడిపై.. పూజారి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండ్రోజుల క్రితం గణపతి ఆలయానికి వచ్చిన ఉప్పల్‌కు చెందిన భక్తుడు.. వినాయకుణ్ని దర్శించుకున్నాడు. పక్కనే ఉన్న ఉప ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో.. అనుమతి లేకుండా ఆ గుడిలోకి ఎలా వెళ్తావంటూ.. పూజారి ప్రభాకర్ శర్మ, భక్తుడితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో ఆగ్రహానికి లోనై భక్తుడిపై దాడి చేశాడు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భక్తుడు పోలీసులను ఆశ్రయించడంతోపాటు.. ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభాకర్ శర్మపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని