మండపంలో వధూవరులు.. కారులో నుంచే మంత్రోచ్ఛరణ

వధూవరులు పక్కపక్కన కూర్చొని ఉండగా.. వారికి ఒక పక్కగా పురోహితుడు ఉండి వారి చేత వేద మంత్రాలు చదివిస్తూ వివాహం జరిపిస్తాడు. హిందూ వివాహాలు జరిగే పద్ధతి ఇది. కానీ కరోనా తెచ్చిన భయమో....

Published : 20 May 2021 01:17 IST

సిద్దిపేట: వధూవరులు పక్కపక్కన కూర్చొని ఉండగా.. వారికి ఒక పక్కగా పురోహితుడు ఉండి వారి చేత వేద మంత్రాలు చదివిస్తూ వివాహం జరిపిస్తాడు. హిందూ వివాహాలు జరిగే పద్ధతి ఇది. కానీ కరోనా తెచ్చిన భయమో.. జాగ్రత్తో తెలియదు కానీ ఓ పురోహితుడు మాత్రం పెళ్లి మండపంలోకి రాకుండానే వివాహం జరిపించేశాడు. ఆన్‌లైన్‌లో వీడియో కాల్‌ ద్వారా పెళ్లి జరిపించాడు అనుకుంటే పొరపాటే. కల్యాణ వేదిక వద్దకు కారులో వచ్చిన పురోహితుడు అదే కారులో కూర్చొని మైక్‌లో మంత్రాలు చదువుతూ వివాహం జరిపించాడు. సిద్దిపేట జిల్లా కోహెడలో ఓ జంట వివాహం జరిపేందుకు ప్రసాదరావు శర్మ అనే పురోహితుడు చేసిన ఈ తతంగం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని