Yadadri: రేపట్నుంచి యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం: ఈవో
రేపట్నుంచి యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.
యాదాద్రి: రేపట్నుంచి యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులను కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నట్టు చెప్పారు. భక్తుల తరలింపునకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా దేవస్థామే భరిస్తుందని తెలిపారు. త్వరలో స్వామి వారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు జోడు సేవలు ప్రారంభిస్తామని ఈవో వెల్లడించారు.
మరోవైపు స్వామివారి నిత్య కైంకర్యాల వేళలను దేవస్థానం ప్రకటించింది. ఉదయం 4 - 4.30 వరకు సుప్రభాతం, 4.30 - 5.00 వరకు బిందె తీర్థం, ఆరాధన, 5 - 5.30: బాలభోగం, 5.30- 6 వరకు పుష్పాలంకరణ సేవ, 6- 7.30 వరకు సర్వదర్శనం, 7.30- 8.30 వరకు నిజాభిషేకం. 8.30- 9 వరకు సహస్రనామార్చన, 9- 10 వరకు బ్రేక్ దర్శనం, ఉదయం 10- 11.45 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్ల తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్