‘బీపీ’ చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నారా?
రక్తపోటు (బీపీ) పరీక్ష చేయించుకోవటమే కాదు.. పరీక్ష చేసే సమయంలో సరిగా కూర్చోవటం వంటివీ ముఖ్యమే. వీపు
రక్తపోటు (బీపీ) పరీక్ష చేయించుకోవటమే కాదు.. పరీక్ష చేసే సమయంలో సరిగా కూర్చోవటం వంటివీ ముఖ్యమే. వీపు కుర్చీకి ఆనకపోవటం, పాదాలు నేలకు తగలకపోవటం వంటి చిన్న చిన్న పొరపాట్లతోనూ రక్తపోటు ఫలితాలు తారుమారు కావొచ్చు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది.
* మూత్రం పోశాకే: మూత్రాశయం నిండుగా ఉంటే రక్తపోటు 10 ఎంఎం హెచ్జీ ఎక్కువగా ఉండొచ్చు. మూత్రం పోశాకే రక్తపోటు పరీక్ష చేయించుకోవటం మేలు.
* పాదాలు నేలకు ఆనాలి: పాదాలు పూర్తిగా నేలకు ఆనకపోయినా, కుర్చీ వెనక భాగానికి వీపును తాకించి నిటారుగా కూర్చోకపోయినా రక్తపోటు ఫలితాలు 6.5 ఎంఎం హెచ్జీ వరకు ఎక్కువగా నమోదు కావొచ్చు.
* కాలు మీద కాలు వద్దు: కాళ్లు ఎడంగా పెట్టి తిన్నగా కూర్చున్నాకే పరీక్ష చేయించుకోవాలి. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నప్పుడు పరీక్ష చేస్తే రక్తపోటు 2-8 ఎంఎం హెచ్జీ వరకు పెరగొచ్చు.
* మౌనంగా, ప్రశాంతగా: రక్తపోటును కొలిచేటప్పుడు మాట్లాడటం తగదు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఆందోళనకు గురైనా రక్తపోటు 10 ఎంఎం హెచ్జీ మేరకు పెరిగే అవకాశముంది.
* దుస్తులపై పట్టీ వద్దు: రక్తపోటు పరికరం పట్టీ దుస్తుల మీద బిగించకుండా ఉంటేనే మేలు. దుస్తుల మీదుగా పట్టీ బిగిస్తే రక్తపోటు ఎక్కువగా చూపించొచ్చు. అలాగే చేతికి తగిన సైజు పట్టీ ఉండేలా చూసుకోవాలి. పట్టీ సైజు చాలా తక్కువగా ఉన్నట్టయితే బీపీ 2-10 ఎంఎం హెచ్జీ వరకు పెరగొచ్చు.
* గుండెకు సమానంగా చేయి: పరీక్ష కోసం చాచిన చేయిని గుండెకు సమాన ఎత్తులో ఉండాలి. సమాన ఎత్తులో లేకపోయినా, చేయి కింద దన్ను లేకపోయినా రక్తపోటు ఫలితం 10 ఎంఎం హెచ్జీ ఎక్కువగా చూపించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు