‘బీపీ’ చెక్‌ చేయించుకోవడానికి వెళ్తున్నారా?

రక్తపోటు (బీపీ) పరీక్ష చేయించుకోవటమే కాదు.. పరీక్ష చేసే సమయంలో సరిగా కూర్చోవటం వంటివీ ముఖ్యమే. వీపు

Updated : 24 Dec 2022 14:42 IST

రక్తపోటు (బీపీ) పరీక్ష చేయించుకోవటమే కాదు.. పరీక్ష చేసే సమయంలో సరిగా కూర్చోవటం వంటివీ ముఖ్యమే. వీపు కుర్చీకి ఆనకపోవటం, పాదాలు నేలకు తగలకపోవటం వంటి చిన్న చిన్న పొరపాట్లతోనూ రక్తపోటు ఫలితాలు తారుమారు కావొచ్చు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది.

* మూత్రం పోశాకే: మూత్రాశయం నిండుగా ఉంటే రక్తపోటు 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా ఉండొచ్చు. మూత్రం పోశాకే రక్తపోటు పరీక్ష చేయించుకోవటం మేలు.

* పాదాలు నేలకు ఆనాలి: పాదాలు పూర్తిగా నేలకు ఆనకపోయినా, కుర్చీ వెనక భాగానికి వీపును తాకించి నిటారుగా కూర్చోకపోయినా రక్తపోటు ఫలితాలు 6.5 ఎంఎం హెచ్‌జీ వరకు ఎక్కువగా నమోదు కావొచ్చు.

* కాలు మీద కాలు వద్దు: కాళ్లు ఎడంగా పెట్టి తిన్నగా కూర్చున్నాకే పరీక్ష చేయించుకోవాలి. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నప్పుడు పరీక్ష చేస్తే రక్తపోటు 2-8 ఎంఎం హెచ్‌జీ వరకు పెరగొచ్చు.

* మౌనంగా, ప్రశాంతగా: రక్తపోటును కొలిచేటప్పుడు మాట్లాడటం తగదు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఆందోళనకు గురైనా రక్తపోటు 10 ఎంఎం హెచ్‌జీ మేరకు పెరిగే అవకాశముంది.

* దుస్తులపై పట్టీ వద్దు: రక్తపోటు పరికరం పట్టీ దుస్తుల మీద బిగించకుండా ఉంటేనే మేలు. దుస్తుల మీదుగా పట్టీ బిగిస్తే రక్తపోటు ఎక్కువగా చూపించొచ్చు. అలాగే చేతికి తగిన సైజు పట్టీ ఉండేలా చూసుకోవాలి. పట్టీ సైజు చాలా తక్కువగా ఉన్నట్టయితే బీపీ 2-10 ఎంఎం హెచ్‌జీ వరకు పెరగొచ్చు.

* గుండెకు సమానంగా చేయి: పరీక్ష కోసం చాచిన చేయిని గుండెకు సమాన ఎత్తులో ఉండాలి. సమాన ఎత్తులో లేకపోయినా, చేయి కింద దన్ను లేకపోయినా రక్తపోటు ఫలితం 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా చూపించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని