అనాథలను దత్తత తీసుకున్న నిర్మాత దిల్‌రాజు

సినీ నిర్మాత దిల్‌రాజు తన పెద్ద మనసును చాటుకున్నారు. తల్లిదంద్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారులను..

Published : 01 Aug 2020 23:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నిర్మాత దిల్‌రాజు పెద్ద మనసు చాటుకున్నారు. తల్లిదంద్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన గట్టు సత్తయ్య గతేడాది అనారోగ్యంతో మృతిచెందాడు. భార్య అనురాధ కూలి పనులు చేసుకుంటూ పిల్లల బాధ్యత చూసుకునేది. అయితే, భర్త చనిపోయిన దిగులుతో మంచం పట్టిన అనురాధ రెండు రోజుల క్రితం మృతిచెందింది. గ్రామస్థులు చందాలు వేసుకొని ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో వారికున్న ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె అనాథలుగా మారారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆత్మకూరు సర్పంచితో మాట్లాడి పిల్లల సంక్షణపై చర్చించారు. అనంతరం నిర్మాత దిల్‌రాజును మంత్రి సంప్రదించి విషయాన్ని వివరించారు. అనాథలైన పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్మాతను కోరారు. మంత్రి వినతికి సానుకూలంగా స్పందించిన దిల్‌రాజు తనవాళ్లను పంపించి పిల్లలను దత్తత తీసుకున్నారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి మరోసారి దిల్‌రాజుకు ఫోన్‌చేసి అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని