కొవిడ్తో మానసిక రోగులకే తీవ్రముప్పు
మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు మిగతావారితో పోల్చితే కొవిడ్-19తో అధికంగా మృత్యువాత పడడమో, ఆసుపత్రులపాలు కావడమో జరుగుతోందని యూరోపియన్ న్యూరో సైకోఫార్మకాలజీ కళాశాల తాజాగా చేసిన అధ్యయనం వెల్లడించింది. కొన్నిరకాల మందులకు అలవాటుపడ్డ
ఇంటర్నెట్ డెస్క్: మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు మిగతావారితో పోల్చితే కొవిడ్-19తో అధికంగా మృత్యువాత పడడమో, ఆసుపత్రులపాలు కావడమో జరుగుతోందని యూరోపియన్ న్యూరో సైకోఫార్మకాలజీ కళాశాల తాజాగా చేసిన అధ్యయనం వెల్లడించింది. కొన్నిరకాల మందులకు అలవాటుపడ్డ మానసిక రోగులు కొవిడ్తో ఎక్కువగా ఆస్పత్రి పాలవుతున్నారని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. దీనికోసం 22 దేశాల్లో 1,469,731 కొవిడ్ రోగుల వివరాలను పరిశీలించారు. అందులో దాదాపు 44 వేలమంది వివిధ మానసిక రోగాలతో బాధపడుతున్నవారేనని తేలింది. అందువల్ల మానసిక రోగులకే మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్లు ఇవ్వాలని వైద్యరంగంలోని జాతీయ-అంతర్జాతీయ సంస్థలకు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు.
వారికే ఎందుకు ప్రాధాన్యతనివ్వాలి?
ఈ అధ్యయనంలో పాల్గొన్న బెల్జియంలోని యూనివర్సిటీ సైకియాట్రిక్ ఆసుపత్రి క్యాంపస్ డఫెల్కు చెందిన డా. లివియా డి పికర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ముందుగా మానసిక రోగులకు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. మానసిక రోగులే కొవిడ్ వల్ల ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పేందుకు ఇంతవరకూ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో విధానకర్తలు ఈ సూచనలను అమలు చేయలేదన్నారు. ‘‘ఎన్నో దేశాల్లో మానసిక రోగులకు ప్రాథమ్యం ఇవ్వాలని అడిగినప్పడు అక్కడి జాతీయ వైద్య సంస్థలు ఫలానా కేటగరీ రుగ్మతలతో బాధపడుతున్నవారికే కొవిడ్ ముప్పు ఎక్కువనీ,
వారిలోనే అత్యధిక మరణాలు ఉన్నాయని, అందువల్ల వారికే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పే ఆదేశాలేవీ తమకు లేనందున తామేం చేయలేమని జవాబు చెప్పేవారు. కానీ ఈ అధ్యయనం వల్ల ఇక నుంచి అలా చెప్పి, తప్పించుకునేందుకు ఇక వారికి ఆస్కారం ఉండదు’’ అని ఆయన చెప్పారు. ‘‘మా వద్ద ఉన్న డాటా తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారికి, ఇతరులకు మధ్య తేడాను స్పష్టం చేస్తోంది. సాధారణంగా మానసిక వ్యాధులతో బాధపడేవారిని ఆస్ప్రత్రికి తీసుకెళ్లడంలోనూ ఇబ్బందులు ఉన్నందువల్ల కొవిడ్ మరణాల రేటు వారిలోనే ఎక్కువగా ఉంది. తీవ్ర ముప్పు గల మానసిక రోగులందరికీ పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందించేందుకు వైద్యాధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే కొవిడ్ సోకిన మానసిక రోగులను చాలా జాగ్రత్తగా చూసుకునేందుకు వీలుగా వెంటనే వారిని పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేయాలి’’ అని డి పికర్ తెలిపారు.
అత్యున్నత ప్రమాణాలు గల అధ్యయనం
యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్కు చెందిన ఇమ్యునో న్యూరో సైకియాట్రీ నెట్వర్క్ డైరెక్టర్ మేరియాన్ లెబోయర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఎంతోమంది వైద్యులందరూ కలిసి పనిచేయడం అత్యున్నత ప్రమాణాలు గల ఈ అధ్యయనం వెలుగు చూసిందన్నారు. అయితే సైకియాట్రీ రోగుల్లోనే కొవిడ్ తీవ్రత అధికంగా ఉండేందుకు కారణాలు తెలుసుకోవాలంటే మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెప్పారు.
మందులు, జీవనశైలి సమస్యలతో ముప్పు ఎక్కువే!
మానసిక రోగులు ఉపయోగించే మందుల వల్ల కూడా కొవిడ్ లక్షణాలు తీవ్రం కావచ్చనిపిస్తోందని లెబోయర్ అన్నారు. గుండెకు సంబంధించిన జబ్బులను, రక్తం గడ్డకట్టడంలాంటివాటిని ఈ మందులు ప్రభావితం చేయవచ్చు అని అన్నారు. ‘‘మానసిక రోగులకు ఇచ్చే బెంజోడయోజెపైన్స్, ఇతర మత్తు మందుల వల్ల కూడా శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. ఇవే ఎక్కువ మరణాలకు కారణమవుతున్నాయి. దీంతోపాటు మానసిక రోగుల్లో కనిపించే సామాజిక, జీవనశైలి సమస్యలు కూడా మరణాలకు కారణాలే. వేళకు తిండి తినకపోవడం, ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, పొగాకు వినియోగం, సరైన నిద్ర
లేకపోవడం కూడా తీవ్ర ప్రభావాలు చూపుతాయి’’ అని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’