Andhra news: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఎంపీ రఘురామ లేఖ

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై సీఐడీ దాడి ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని ..

Published : 20 Feb 2022 15:26 IST

దిల్లీ: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై సీఐడీ దాడి ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని కోరారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు కేసులు పెట్టి తనను చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌ ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. ఘటనపై లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా నివేదిక కోరినా.. సవాంగ్‌ స్పందించలేదని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. స్పీకర్‌కు త్వరగా నివేదిక పంపాలని డీజీపీని కోరారు. పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని