ఆ ముసాయిదాను వెనక్కు తీసుకోవాలి: రాహుల్గాంధీ
పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) ముసాయిదాను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ కేంద్రంపై ఎదురుదాడి పెంచారు. దేశాన్ని దోచుకునేలా ముసాయిదాను రూపొందించినట్లు ఆరోపించారు.
దిల్లీ: పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) ముసాయిదాను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశాన్ని దోచుకునేలా ముసాయిదాను రూపొందించినట్లు ఆరోపించారు. పర్యావరణ విధ్వంసాన్ని ఆపేందుకు గాను ఈ ముసాయిదాను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. తన సూటుబూటు స్నేహితులైన పారిశ్రామికవేత్తలు దేశ వనరులను కాజేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ ముసాయిదా తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ ముసాయిదాను ప్రమాదకరమైనదిగా ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంలో మార్పులు చేస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ ప్రభావ మదింపు ముసాయిదాను రూపొందించింది. భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విధంగా కొత్త ముసాయిదాలో వీలు కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ, సూచనలు, వినతులకు కేవలం 20రోజుల గడువు మాత్రమే విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!