మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్‌ 

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ పట్టు తప్పి కింద పడిపోతుండగా ఒక రైల్వే కానిస్టేబుల్

Published : 23 Jun 2021 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ పట్టు తప్పి కింద పడిపోతుండగా ఒక రైల్వే కానిస్టేబుల్ ఆమెను కాపాడారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీ రైల్వే స్టేషన్‌లో జరిగింది. బాధితురాలు ఆలస్యంగా రావటంతో రైల్వే ప్లాట్ ఫాం నుంచి ఆమె ఎక్కాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్ కదిలింది. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ఆమె పట్టు కోల్పోయింది. దీంతో అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ ఆమెను కాపాడారు. ఈ దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని