Raja Cave: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మరో అందమైన గుహలు
విశాఖ జిల్లాలో పర్యాటకంగా ముందుగా గుర్తొచ్చేవి బొర్రా గుహలు..! ప్రాచుర్యంలోకి రాని మరో గుహలు....... ఇప్పుడు వార్తల్లోకెక్కాయి. ఇంతకీ అవి ఎక్కడున్నాయి. ఆ గుహల చరిత్రేంటి..?
మన్యంలో ఓ నవలోకం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మారుమూల గ్రామంలో సహజసిద్ధంగా ఏర్పడ్డ అందమైన గుహలు వెలుగులోకి వచ్చాయి. హుకుంపేట మండలం పామురాయి వద్ద ఉన్నవీటిని స్థానికులు రాజుల గుహలుగా పిలుస్తుంటారు. ప్రవేశమార్గంలో 10 మీటర్ల వెడల్పుతో ఉండి లోపలికు వెళ్తున్న కొద్దీ వెడల్పు పెరుగుతుంది. లోపల మరెన్నో గుహలకు మార్గాలు ఉంటున్నాయి. పెద్ద లైట్లు, కాగడాలతో లోపలకు వెళ్లినా 40 మీటర్లకు మించి వెళ్లలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు. గుహ లోపలభాగం రాయి అంతా అరుణవర్ణంలో ఉండి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెలుతురు ప్రవేశించేవరకు చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు వెళ్తుంటారు.
గతంలో భూపతి రాజులు, జైపూర్ రాజులు ఈ గుహల వద్దకు వేటకు వచ్చేవారని స్థానికులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ వారి పాలనలో స్వాతంత్య్ర సమర యోధులు ఇక్కడి నుంచే పోరాటాలు చేసేవారని చెబుతున్నారు. రాజులు వినియోగించారు కాబట్టే దీనిని రాజుల గుహలుగా పిలుస్తారని తెలిపారు. పర్యటక శాఖ స్పందించి వీటి అభివృద్ధికి నడుంబిగిస్తే ఈ ప్రాంతమంతా ఎంతగానో అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని పామురాయి, కామయ్యపేట గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.
చేరుకోవటం ఎలా?: పాడేరుకు సమీపంలో హుకుంపేట మండల కేంద్రం ఉంది. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరం కామయ్యపేట, పామురాయి మీదుగా ముక్తిమామిడి గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కాలినడకన కొండచివరన అర కిలోమీటరు దూరం వెళితే రాజులగుహలు చేరుకోవచ్చు.
- హుకుంపేట, (అరకులోయ) న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు