RamGopalVarma: జూబ్లీహిల్స్‌ ఘటనపై రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఈకేసు కీలకంగా మారింది

Published : 09 Jun 2022 01:19 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఈకేసు కీలకంగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో రాజకీయ రంగు పులుముకుంది. మరో వైపు సంచలన విషయాలపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ... జూబ్లీహిల్స్‌ ఘటనపై కూడా స్పందించారు. ‘‘జూబ్లీహిల్స్‌ ఘటనపై భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రమే నిజాయితీగా మాట్లాడుతున్నారు. మిగతా వారంతా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం బాధాకరం’’ అని వర్మ ట్వీట్‌ చేశారు.

జూబ్లీహిల్స్‌ ఘటన బాహ్య ప్రపంచానికి తెలియక ముందే దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రముఖల పిల్లలు ఉండటంతోనే కేసు దర్యాప్తును పోలీసులు నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేయడంతో రఘునందన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని