Bizzare news: పొట్టేలుకు మూడేళ్ల జైలు.. కారణమిదే!
మహిళ మృతి కేసులో దోషిగా తేలడంతో ఓ పొట్టేలుకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ విచిత్ర ఘటన దక్షిణ సూడాన్లో వెలుగుచూసింది. స్థానిక వార్తాసంస్థల వివరాల ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో దక్షిణ సూడాన్లోని రుంబెక్ ఈస్ట్లో...
ఇంటర్నెట్ డెస్క్: మహిళ మృతి కేసులో దోషిగా తేలడంతో ఓ పొట్టేలుకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ విచిత్ర ఘటన దక్షిణ సూడాన్లో వెలుగుచూసింది. స్థానిక వార్తాసంస్థల వివరాల ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో దక్షిణ సూడాన్లోని రుంబెక్ ఈస్ట్లో 45 ఏళ్ల ఆదియు చాపింగ్పై పొరుగింటి పొట్టేలు దాడి చేసింది. పదేపదే తలతో ఢీకొట్టడంతో.. ఆమె తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ జీవిని అదుపులోకి తీసుకున్నారు. ‘ఈ ఘటనలో యజమాని నిర్దోషి. నేరానికి పాల్పడింది పొట్టేలు కాబట్టి.. దాన్ని అదుపులోకి తీసుకున్న’ట్లు వారు వివరించారు.
అనంతరం ఈ కేసులో వాదనలు విన్న స్థానిక కోర్టు.. పొట్టేలును దోషిగా నిర్ధారించింది. అడ్యూల్ కౌంటీ హెడ్క్వార్టర్స్లోని మిలిటరీ క్యాంప్లో మూడేళ్లపాటు ఉంచాలని తీర్పు చెప్పింది. దాని యజమాని.. బాధితురాలి కుటుంబానికి అయిదు ఆవులనూ పరిహారంగా అప్పగించాలని ఆదేశించింది. మరోవైపు.. స్థానిక సంప్రదాయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని చంపిన పెంపుడు జంతువును అతని కుటుంబానికే పరిహారంగా ఇస్తారు. దీని ప్రకారం శిక్ష అనంతరం.. ఆ జీవిని బాధితురాలి కుటుంబానికే అప్పగించనున్నారు. ఇదిలా ఉండగా.. పొట్టేలు దాడిలో మనుషులు మృతి చెందడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అమెరికాలోనూ ఓ మహిళ పొలంలో పొట్టేళ్ల దాడిలో మరణించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్