Ramadan Eid: భక్తిశ్రద్ధలతో రంజాన్‌ ప్రార్థనలు.. ఫొటో ఫీచర్‌

దేశవ్యాప్తంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌(రంజాన్‌) పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

Published : 03 May 2022 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దేశవ్యాప్తంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌(రంజాన్‌) పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రంజాన్‌ను ఘనంగా జరుపుకొన్నారు. హైదరాబాద్‌లోని ప్రార్థనా స్థలాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు చోట్ల ప్రార్థనలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు వాహనాలను దారి మళ్లించారు. ఏపీలో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈద్‌-ఉల్-ఫితర్‌ను జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు చోట్ల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని