ఎస్ఈసీగా మరోసారి నిమ్మగడ్డ బాధ్యతలు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే నిమ్మగడ్డను ప్రభుత్వం పునర్నియమించిన విషయం
అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే నిమ్మగడ్డను ప్రభుత్వం పునర్నియమించిన విషయం తెలిసిందే. గవర్నర్ నోటిఫికేషన్ మేరకు శుక్రవారమే హైదరాబాద్లో బాధ్యతలు చేపట్టినట్లు రమేశ్కుమార్ తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టినట్లు కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సమాచారమిచ్చినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ ద్వారా వీరికి సమాచారమందించినట్లు తెలిపారు. బాధ్యతల నిర్వహణకు ఇవాళ విజయవాడలోని కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
‘ఈసీ అనేది స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. విధుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా. గతంలో మాదిరిగానే ప్రభుత్వ సహకారం ఉంటుందని అనుకుంటున్నా’ అని ఎస్ఈసీ రమేశ్కుమార్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.