Ramgopal varma: తెరాసను భారాసగా మార్చిన ‘ఆదిపురుష్‌’ కేసీఆర్‌: రాంగోపాల్‌ వర్మ

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్నట్టు పేర్కొన్న వర్మ..

Published : 06 Oct 2022 01:53 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్నట్టు పేర్కొన్న వర్మ.. తెరాసను భారాసగా మార్చిన ఆదిపురుష్‌ కేసీఆర్‌ అంటూ తనదైన శైలిలో కొనియాడారు. వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనదైన మాటలతో ఆకట్టుకునే వర్మ.. తాజాగా ఆదిపురుష్‌ వివాదానికి ముడిపెట్టి కేసీఆర్‌కు స్వాగతం పలకడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వర్మ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని