Centre: ఆ పది రాష్ట్రాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచండి
థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందంటూ పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రోజురోజుకూ కొత్తగా కరోనా కేసులు, టెస్ట్ పాజిటివిటీ రేటు(టీపీఆర్) పెరుగుతున్న 10 రాష్ట్రాల్లో వైరస్ నిర్దారణ పరీక్షలు,
దిల్లీ: థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందంటూ పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రోజురోజుకూ కొత్తగా కరోనా కేసులు, టెస్ట్ పాజిటివిటీ రేటు(టీపీఆర్) పెరుగుతున్న 10 రాష్ట్రాల్లో వైరస్ నిర్దారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ను పెంచాల్సిందిగా రాజేశ్ భూషణ్ సూచించారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపుర్ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రజలు గుమికూడకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలన్నారు. కేసులు పెరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు.
కేరళలో కొనసాగుతున్న వైరస్ ఉద్ధృతి
దేశంలో.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు, 541 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 4,24,351కి చేరుకుంది. ప్రస్తుతం 4,10,952 క్రియాశీల కేసులున్నాయి. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో 50 శాతం కేరళలోనే వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం అక్కడ కొత్తగా 20,728 మందికి వైరస్ సోకగా.. కొవిడ్తో 56 మంది మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట