TS News: కాంగ్రెస్ వరి దీక్షలో ఆసక్తికర సన్నివేశం!
ఇందిరాపార్కు వద్ద తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్షలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ దీక్షకు హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాదరంగా..
హైదరాబాద్: రైతులు పండించే ప్రతి వరి గింజనూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలే కొనాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ దీక్షకు హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా రేవంత్ నియామకం తర్వాత పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి.. తనకు ఆ పదవి దక్కకపోవడంతో పార్టీ అధిష్ఠానం పట్ల, స్థానిక నేతల పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ వచ్చారు. అయితే, పలుమార్లు వీరిద్దరి మధ్య సంధి కుదిర్చేందుకు కొందరు పార్టీ సీనియర్ నేతలు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. గత కొన్ని రోజులుగా వీహెచ్ కూడా రాజీ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో వరి దీక్షకు హాజరు కానున్నట్టు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ దీక్షావేదికపై రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పక్కపక్కనే కూర్చోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్