Rainfall: ముంబయిలో రెడ్ అలర్ట్..!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముంబయిలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు భారత వాతావరణ శాఖ
ముంబయి: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముంబయిలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ముంబయి విభాగం ప్రధాన అధికారి డాక్టర్ జయంత్ సర్కార్ సోమవారం వెల్లడించారు. మంగళవారం నుంచి రెండు రోజులపాటు నగరంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన పలు ఘటనల్లో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో నగరంలోని 407 శిథిల భవనాలను ముంబయి మహానగర పాలక సంస్థ ముందస్తుగానే గుర్తించింది. అయితే వాటిలో ఇప్పటివరకు 150 భవనాలను మాత్రమే కూల్చింది.
ముంబయిలో ఆదివారం కురిసిన భారీ వర్షం సోమవారం ఉదయానికి కాస్త నెమ్మదించింది. మళ్లీ ఈ ఉదయం వర్షం తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టాలపై నీరు ప్రవహిస్తుండటంతో స్థానికంగా పలు రైల్వే సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉదయం నిర్ణీత సమయం పాటు పలు రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు ఈ నెల వచ్చే గురువారం వరకు మహారాష్ట్ర-గోవా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అవి గంటకు 65 కిలోమీటర్ల వరకు వేగం పుంజుకునే అవకాశం ఉందని ముంబయిలోని ఓడరేవు హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం సమీక్షించారు. శిథిల భవనాలు, కొండ చరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి