Reliance: ఉద్యోగులకు రిలయన్స్ ఆపన్న హస్తం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఉదారతను చాటుకున్నారు. తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల భద్రతకు పెద్దపీట వేశారు. కరోనా మహమ్మారికి బలైన ఉద్యోగుల కుటుంబాలను....
ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఉదారతను చాటుకున్నారు. తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల భద్రతకు పెద్దపీట వేశారు. కరోనా మహమ్మారికి బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోనున్నారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లల విద్యకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆ ఉద్యోగి చివరిసారి తీసుకున్న జీతాన్ని ఐదేళ్ల పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నీతా అంబానీతో కలిసి ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు.
ప్రియమైన సహచరులకు..
కొవిడ్-19 గతంలో మనమెప్పుడూ చవిచూడని బాధాకరమైన అనుభవాలను పంచింది. మన సహచరులు, వారి కుటుంబ సభ్యుల మరణాలు కలచివేస్తున్నాయి. ఆ విషాదాల నుంచి కోలుకొనేందుకు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం.
చనిపోయిన వారి నష్టం పూడ్చలేనిది. ‘ఒకే రిలయన్స్ కుటుంబం’గా అవి మన మనసుపై పెనుభారమే మోపాయి. మన ఆత్మీయుల నష్టాన్ని పూడ్చలేక పోయినా వారి కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికీ అండగా నిలిచేందుకు మేం కట్టుబడ్డాం. వారికి విశ్వాసం కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
రిలయన్స్లో మనందరినీ కలిపే ఉమ్మడి బంధమేదైనా ఉందంటే అది ‘WE CARE’. అందుకే మేం ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తాం. ఈ బాధాకర పరిస్థితుల్లో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్ అండగా నిలబడుతుంది. అందుకే మేం ‘రిలయన్స్ కుటుంబ మద్దతు, సంక్షేమ పథకం’ ప్రకటిస్తున్నాం.
► చనిపోయిన ఉద్యోగి నామినీకి ఐదేళ్లు జీతభత్యాలు అందజేస్తాం. చివరగా తీసుకున్న వేతనాన్నే అందిస్తాం.
► మృతిచెందిన ఉద్యోగి పిల్లలు భారతదేశంలోని ఏ విద్యా కేంద్రంలోనైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసే వరకు 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతి, పుస్తకాల ఫీజుల్ని అందిస్తాం.
► పిల్లలు డిగ్రీ పూర్తి చేసేంత వరకు చనిపోయిన ఉద్యోగి భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల ప్రీమియం ఆస్పత్రి ఖర్చులన్నీ 100% మేమే భరిస్తాం.
ఇక కొవిడ్ బారిన పడ్డ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి సోకినా ప్రత్యేకంగా కొవిడ్ సెలవులు తీసుకోవచ్చు. మానసికంగా, శారీరకంగా కోలుకొనేంత వరకు సెలవులు తీసుకోవచ్చు.
మా సహచరులు లేదా వారి కుటుంబ సభ్యులు పూర్తిగా కోలుకోవడం పైనే దృష్టి పెట్టేందుకే మేం ఈ సెలవు విధానాన్ని పొడిగిస్తున్నాం. (ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ ఈఎస్ఎస్/ఆర్-కనెక్ట్ పోర్టల్స్లో ఉంటాయి)
ప్రియమైన సహోద్యోగి, ఈ క్లిష్ట పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా మీరు ఒంటరిగా లేరని నిత్యం గుర్తు తెచ్చుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు అండగా రిలయన్స్ పరిశ్రమ మొత్తం ఉంటుందని గుర్తుంచుకోండి. మనమంతా ఒక్కటే అనే ఉద్దేశంతో మేం మీ ముందుకొచ్చాం. ఈ విపత్తుపై విజయం సాధించే వరకు ఒక్కతాటిపై నిలబడదాం.
పోరాట పటిమను వదలొద్దు. ఎందుకంటే మున్ముందు మంచి రోజులు కచ్చితంగా వస్తాయి. ఆ సమయం వచ్చేంత వరకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు బలాన్ని ఇవ్వాలని మేం ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తుపై నమ్మకంతో ఒకరికొకరం అండగా ఉంటూ ముందుకు సాగుదాం. మిమ్మల్ని, మీ కుటుంబీకులను జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి.
ఇట్లు
ముకేశ్ అంబాని, నీతా అంబాని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?