Balasubrahmanyam: గుంటూరులో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం విగ్రహం తొలగింపుతో వివాదం చోటు చేసుకుంది. గుంటూరులోని మదర్ థెరీసా కూడలిలో కళా దర్బార్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి అనుమతి లేదంటూ..నగరపాలక సంస్థ అధికారులు తొలగించేశారు.
గుంటూరు: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం విగ్రహం తొలగింపుతో వివాదం చోటు చేసుకుంది. గుంటూరులోని మదర్ థెరీసా కూడలిలో కళా దర్బార్ అధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనుమతి లేదంటూ నగరపాలక సంస్థ అధికారులు దానిని తొలగించేశారు. దీంతో కార్పొరేషన్ అధికారులపై కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలు విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోరుతూ రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగామని కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు అన్నారు. ‘‘ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎందుకు తొలగించారు?. మహా గాయకుడికి కార్పొరేషన్ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేసింది కేవలం గుంటూరు లోనేనని ఆయన చెప్పారు. గుంటూరులో దాదాపు 200పైగా అనుమతి లేని విగ్రహాలున్నాయని ఆయన అన్నారు. తిరిగి బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్