Lockdown: సూర్యాపేట సరిహద్దులో ఆంక్షలు!
కరోనా కట్టడికి తెలంగాణలో కఠిన లాక్డౌన్లో భాగంగా ఆదివారం నుంచి సూర్యాపేట సరిహద్దులో ఆంక్షలు విధించనున్నట్టు పోలీసులు వెల్లడించారు
సూర్యాపేట: కరోనా కట్టడికి తెలంగాణలో కఠిన లాక్డౌన్లో భాగంగా ఆదివారం నుంచి సూర్యాపేట సరిహద్దులో ఆంక్షలు విధించనున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఏపీ నుంచి వచ్చేవారికి ఈ-పాస్ను తప్పనిసరి చేశారు. అంబులెన్సులు,అత్యవసర వాహనాలకు మాత్రం ఈ-పాస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అత్యవసర వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరని ఎస్పీ భాస్కరన్ స్పష్టంచేశారు. విచ్చలవిడిగా తిరుగుతున్న జనాన్ని అదుపు చేసేందుకే ఆంక్షలు అమలుచేస్తున్నట్టు తెలిపారు. లాక్డౌన్ సడలింపు వేళల్లోనూ ఈ-పాస్ తప్పనిసరన్నారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగింటిలో మూడు చెక్పోస్టులు మూసివేస్తున్నట్టు చెప్పారు. హైవే మీదుగానే అందరూ తెలంగాణలోకి రావాలని, మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్పోస్టులను మూసివేసినట్టు ఎస్పీ వెల్లడించారు. కోదాడ మీదుగానే ఏపీ వాహనాలకు అనుమతిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం