ఎనిమిది పదుల వయసులో పీజీ చేసిన విశ్రాంత ఉద్యోగి
ముడతలు పడిన చర్మం, మసకబారిన కంటిచూపు, మోకాళ్ల నొప్పులతో సహకరించని
ఇంటర్నెట్ డెస్క్: ముడతలు పడిన చర్మం, మసకబారిన కంటిచూపు, మోకాళ్ల నొప్పులతో సహకరించని శరీరం ఇలా అనేక వృద్ధాప్య సమస్యలున్నా ఏ ఒక్కటీ ఆయన సంకల్పానికి అడ్డురాలేదు. పీజీ పట్టా సాధించాలనే పట్టుదల ముందు ఆ సమస్యలన్నీ చిన్నబోయాయి. కృష్ణారామా అనుకునే 80 ఏళ్ల వయసులో ఉన్నత విద్యావంతుడిగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఎం.సి.పుల్లయ్య.
నంద్యాల కురవపేటకు చెందిన పుల్లయ్య పీయూసీ పూర్తి చేసి 1961లో పంచాయతీ సమితిలో చిరుద్యోగిగా చేరారు. 1998లో సూపరింటెండెంట్గా పదవీవిరమణ చేశారు. తోటి మిత్రులంతా ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు కావడంతో పుల్లయ్య ఉన్నత విద్యపై దృష్టి సారించారు. డిగ్రీ, పీజీ చేయాలనే లక్ష్యంతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి 2015లో బి.ఎ. పూర్తి చేశారు. అనారోగ్య సమస్యలు అడ్డంగా నిలిచినా పట్టుదలతో 2021లో ఎమ్ఏ సాహిత్యంలో పీజీ పట్టా అందుకున్నారు. చదవాలనే పట్టుదలకు, సాధించాలనే సంకల్పం తోడైతే ఏవయసువారైనా ఉన్నత విద్యను అభ్యసించవచ్చని అంటున్న పుల్లయ్య ఆరోగ్యం సహకరిస్తే పీహెచ్డీ కూడా పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు