Revanth Reddy: ఇంద్రవెల్లి సభకు జాతీయస్థాయిలో ప్రాముఖ్యత దక్కింది: రేవంత్‌ రెడ్డి

ఆదివాసీలతో కాంగ్రెస్ నిర్వహించిన ఇంద్రవెల్లి సభకు జాతీయస్థాయిలో ప్రాముఖ్యత దక్కిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 30 Jan 2022 19:17 IST

ఇంద్రవెల్లి: ఆదివాసీలతో కాంగ్రెస్ నిర్వహించిన ఇంద్రవెల్లి సభకు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత దక్కిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని ఎమ్మెల్యే సీతక్కతో కలిసి సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయాలను కాపాడుతున్న మెశ్రం వంశీయుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం అక్కడి ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆదివాసీల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆదిలాబాద్‌కు వెళ్తున్న క్రమంలో భూపాలపల్లిలో ఆగిన రేవంత్‌కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని