Telangana News: జూన్ 26కు చాలా ప్రత్యేకత ఉంది: రేవంత్ రెడ్డి
ఈరోజు (జూన్ 26న)కు చాలా ప్రత్యేకత ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనను నమ్మి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు సోనియా గాంధీ
హైదరాబాద్: ఈరోజు(జూన్ 26)కు చాలా ప్రత్యేకత ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనను నమ్మి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడాలని సోనియా గాంధీ.. పీసీసీ పదవి అప్పగించారని తెలిపారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులు, గిరిజనుల కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. నిరుద్యోగ జంగ్ సైరన్తో యువతకు అండగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడామని తెలిపారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే చాలా అవహేళనగా మాట్లాడారని.. కానీ, ఉచిత కరెంటు ఇచ్చి ఆయన రైతుల మన్ననలను పొందారని గుర్తు చేశారు. పేదవాడికి ఆరోగ్యశ్రీ పేరిట అపోలో, యశోదా లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలకు ఉచిత విద్య అందించామన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని పునరుద్ఘాటించారు. తెలంగాణ తొలి కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని.. ఉన్న దళిత మంత్రిని అర్ధంతరంగా తొలగించారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు ఉంటాయని.. జూన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్ధన్...
చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, భాజపా నాయకుడు బోడ జనార్ధన్, పలువురు భాజపా నాయకులు, సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన బీఎస్పీ నేత రావి శ్రీనివాస్, కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి జడ్పీటీసీ, తెరాస నాయకులు రాధ శ్రీనివాస్రెడ్డి, కోరుట్ల మాజీ మార్కెట్ ఛైర్మన్ కళ్లెం శంకర్రెడ్డిలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోడ జనార్ధన్ మాట్లాడుతూ.. కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఒక్కడే అన్నారు. భాజపాలో బీసీలకు, దళితులకు న్యాయం జరగడం లేదని గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని.. బాల్క సుమన్ ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పి రూ.వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్యేలు కూడా రూ.వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
తెలంగాణ నూతన గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి..
ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది. -
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం