RMC: శ్రీశైలం విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం: ఆర్కే పిళ్లై
కేంద్రం జలసంఘం సూచనల ప్రకారం నాగార్జున సాగర్ రూల్కర్వ్స్పై నిర్ణయం తీసుకుంటామని రవికుమార్ పిళ్లై వెల్లడించారు. జల విద్యుత్ చెరిసగం వినియోగానికి ఇరు రాష్ట్రాలు ఆమోదించాయని చెప్పారు.
హైదరాబాద్: శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్లో మార్పులు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని కృష్ణా యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై వెల్లడించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూల్ కర్వ్స్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్న ఆయన.. మరింత స్పష్టత కోసం కేంద్ర జలసంఘం అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్టు వివరించారు. హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) కన్వీనర్ ఆర్.కె.పిళ్లై అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేఆర్ఎంబీ సభ్యుడు మౌంతాగ్, తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజాం, ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు.
కేంద్ర జలసంఘం సూచనల ప్రకారం నాగార్జున సాగర్ రూల్కర్వ్స్పై నిర్ణయం తీసుకుంటామని రవికుమార్ పిళ్లై వెల్లడించారు. జల విద్యుత్ చెరిసగం వినియోగానికి ఇరు రాష్ట్రాలు ఆమోదించాయని చెప్పారు. మిగులు జలాల విషయంలో సమావేశంలో స్పష్టత వచ్చిందన్న ఆయన.. ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఓవర్ఫ్లో అయ్యాకే వరదను మిగులు జలాల కింద పరిగణించాలని ఇరు రాష్ట్రాలు సూచించాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణానది ప్రవేశించాక.. సరిహద్దు నుంచి ప్రతి నీటి చుక్కా లెక్కించాలన్న నిర్ణయానికి రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్టు రవికుమార్ పిళ్లై చెప్పారు. రెండు రాష్ట్రాల అంగీకారంతో నివేదికను ఖరారు చేస్తామన్న ఆయన.. అనంతరం శాశ్వత ప్రాతిపదికన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశముందన్నారు.
నాగార్జున సాగర్ విషయంలో సీడబ్ల్యూసీ నిర్ణయం: ఏపీ ఈఎన్సీ
శ్రీశైలం జలాశయం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. శ్రీశైలం రూల్కర్వ్స్, నీటిమట్టం, విద్యుదుత్పత్తిపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. నాగార్జున సాగర్ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదని.. దీనిపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. సముద్రంలో వృథాగా కలిసే నీటిని లెక్కించాలే తప్ప.. ఆ నీటిని రాష్ట్రాల వాటాలో కలపకూడదని కమిటీ నిర్ణయించిందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!