ఏపీలో రూ.6400కోట్ల టెండర్లు రద్దు
ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రూ.6400 కోట్లతో 3వేల కి.మీల మేర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు చేస్తూ.. మరోసారి టెండర్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో మళ్లీ టెండర్లు .....
అమరావతి: ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రూ.6400 కోట్లతో 3వేల కి.మీల మేర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన సర్కార్.. మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. వారంలో మళ్లీ టెండర్లు పిలిచి.. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. టెండర్ల దాఖలులో ఎవరూ భయాందోళనకు గురికాలేదని.. ఎక్కువ విలువైన పనుల్లో గుత్తేదార్లు తక్కువగా పాల్గొంటారని చెప్పారు. ఎన్డీబీ ద్వారా చేపట్టిన పనులను 26 ప్యాకేజీలుగా పిలిచామనీ.. మరింత మందికి అవకాశం కల్పించేందుకే రీటెండర్లు పిలిచినట్టు స్పష్టంచేశారు. ఈ టెండర్లపై తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకే రీటెండర్లకు పిలుస్తున్నామన్నారు.
రోడ్ల నిర్మాణం జాప్యమైనా పర్వాలేదని సీఎం చెప్పారని తెలిపారు. గుత్తేదార్లతో సమావేశాలు నిర్వహిస్తామని, బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత ఉండదని తెలిపారు. ప్రతి టెండర్ ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకే నిర్వహిస్తున్నట్టు కృష్ణబాబు చెప్పారు. గుత్తేదారులకు పనుల అప్పగింతలో ఆర్థిక అర్హతలు బేరీజు వేస్తామన్నారు. ఈ- టెండర్ దాఖలు చేసినా హార్డ్ కాపీలు ఇవ్వాలని సూచించామని తెలిపారు. సెప్టెంబర్తో సమయం ముగిసినా కేంద్రాన్ని మరింత గడువు కోరినట్టు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!