ఎన్సీఆర్ పరిధిలో నిర్మాణ సంస్థలపై వేటు!
దేశ రాజధాని పరిధిలో వాయు కాలుష్య నిబంధనల్ని ఉల్లంఘించిన పలు నిర్మాణ సంస్థలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరిపి వాయు కాలుష్యానికి కారణమైన 12 సంస్థలపై రూ.1.59కోట్ల జరిమానా విధించింది.
దిల్లీ: దేశ రాజధాని పరిధిలో వాయు కాలుష్య నిబంధనల్ని ఉల్లంఘించిన పలు నిర్మాణ సంస్థలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరిపి వాయు కాలుష్యానికి కారణమైన 12 సంస్థలపై రూ.1.59కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు వాతావరణ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
‘దేశరాజధాని పరిధిలో గత నెల 24 నుంచి 31 వరకు నిబంధనలు ఉల్లంఘించిన కాలుష్యానికి కారకులైన వారిపై.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ ప్రత్యేక కమిటీలు మూడు వేల ప్రదేశాల్లో పరిశీలన జరిపగా.. 386 చోట్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించాయి. వీటిలో.. 12 ప్రదేశాల్లో జరిగిన నిర్మాణాలు కాలుష్యాన్ని అత్యధికంగా పెంపొందించేలా ఉన్నందున జరిమానా విధించేందుకు దిల్లీ సహా పరిసర రాష్ట్రాల కాలుష్య మండళ్లకు సిఫారసు చేశాయి. దీంతో కాలుష్య నియంత్రణ మండలి 12 చోట్ల జరిగిన ఉల్లంఘనలపై రూ.1.59 కోట్ల జరిమానా విధించి.. అన్ని చోట్ల వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించిన వాహనాలపై కూడా రూ.1.17 కోట్ల విధించింది’ అని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర వాతావరణశాఖ 224 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
గంగూలీకి యాంజియోప్లాస్టీ తర్వాత చేస్తాం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్