తెగ తాగేశారు!
తెలంగాణలో నూతన సంవత్సర పార్టీలకు అనుమతి లేకపోయినా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మందు బాబులు ఇళ్లల్లోనే మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు రూ.759 కోట్ల....
నాలుగు రోజుల్లో రూ.759 కోట్ల మద్యం విక్రయాలు
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో నూతన సంవత్సర పార్టీలకు అనుమతి లేకపోయినా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మందు బాబులు ఇళ్లల్లోనే మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు రూ.759 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఆబ్కారీ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీరు కేసులు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు రూ.200 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. డిసెంబర్ 28వ తేదీన రూ.205.18 కోట్లు, 29న రూ.150 కోట్లు, 30న 211.35 కోట్లు, 31వ తేదీన రూ.193 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఉమ్మడి జిల్లాల వారీగా.. కరీంనగర్ జిల్లాలో రూ.50.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 52.70 కోట్లు, మహబూబ్నగర్లో రూ.47.78 కోట్లు, మెదక్లో రూ.53.87 కోట్లు, నల్గొండలో రూ.75.98 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.37.5 కోట్లు, వరంగల్లో రూ.63.49 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు అనుమతించకపోయినా గతేదాడి కంటే ఈసారి మద్యం విక్రయాలు భారీగానే జరిగినట్లు పేర్కొంటున్నాయి.
ఈ ఏడాది పార్టీలకు అనుమతించని పోలీసులు ప్రమాదాల నివారణకు విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లో బేగంపేట్ ఫ్లైఓవర్ మినహా తెలుగుతల్లి, బషీర్భాగ్, నారాయణగూడ, పంజాగుట్ట ఫ్లైఓవర్లను మూసివేశారు. ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు, దుర్గం చెరువు తీగల వంతెనపైకి రాత్రి వాహనాలను అనుమతించలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పరిశీలించిన సీపీ సజ్జనార్.. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకోవద్దని వాహనదారులకు సూచించారు. ఈ ఏడాది సురక్షిత డ్రైవింగ్తో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాక్షించారు.
ఇవీ చదవండి...
ఆహ్వానం 2021.. అనూహ్య ప్రపంచానికి!
2020ని తిట్టకండి.. ఎందుకంటారా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు