ఓ వైపు కరోనా.. మరో వైపు వేడుకలు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా విజృంభిస్తుంటే సచివాలయ ఉద్యోగులు మాత్రం పార్టీలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో అధికారులు బహిరంగ పార్టీలపై నిషేధం విధించారు....

Updated : 27 Mar 2021 11:48 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా విజృంభిస్తుంటే సచివాలయ ఉద్యోగులు మాత్రం పార్టీలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో అధికారులు బహిరంగ పార్టీలపై నిషేధం విధించారు. ప్రజలు ఎక్కడ గుమిగూడినా రూ.వెయ్యి జరిమానా వెయ్యాలని నిర్ణయించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పుట్టినరోజు వేడుకలను సీతానగరం మున్సిపల్‌ అతిథిగృహంలో నిర్వహించారు. దీంతో ఉద్యోగులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని