Corona.. అజాగ్రత్త వెనుక అపాయం!
కొంత నిర్లక్ష్యం, మరికొంత అవగాహన లోపం.. కొవిడ్ రోగుల్లో తీవ్రతకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అశాస్త్రీయ విధానాలు పాటిస్తూ ప్రాణాల
లక్షణాలున్నా టీకా కోసం పరుగులు
సొంత నిర్ణయాలు వద్దంటున్న వైద్యనిపుణులు
ఈనాడు, హైదరాబాద్
కొంత నిర్లక్ష్యం, మరికొంత అవగాహన లోపం.. కొవిడ్ రోగుల్లో తీవ్రతకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అశాస్త్రీయ విధానాలు పాటిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు, సహచరులకు కొవిడ్ సోకినట్టు నిర్ధారణ కాగానే కొందరు టీకా కోసం పరుగులు తీస్తున్నారు. అప్పటికే వారిలో కొంతమంది వైరస్ బారినపడినా లక్షణాలు కనిపించకపోవడంతో ఇటువంటి తప్పిదాలు చేస్తున్నారని వైద్యులు విశ్లేషిస్తున్నారు. అనంతరం లక్షణాలు కనిపించినా.. టీకా ప్రభావమనే భ్రమలో గడిపేస్తున్నారు. వాస్తవానికి టీకా తీసుకున్నాక కొద్దిమందిలో జ్వరం, ఒళ్లునొప్పులు ఒకటి రెండ్రోజులు మాత్రమే ఉంటాయని డా.శ్రీనివాస్ తెలిపారు. టీకా తీసుకున్నాక, కొవిడ్ లక్షణాలను ఒకే గాటిన కట్టేసి.. అయోమయంలో ఉండటం కొన్నికేసుల్లో మరణాలకు దారితీసిందని నగరానికి చెందిన ప్రముఖ పల్మనాజిస్టు ఒకరు తెలిపారు. ఇంటి వైద్యంతో కాలయాపన చేయొద్దని నిమ్స్ ఆసుపత్రిలోని ప్రముఖ మూత్రపిండ వైద్యనిపుణులు డా.శ్రీభూషణ్రాజు సూచించారు. పూర్తిగా కోలుకున్నా.. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా టీకా వేయించుకోవాలని స్పష్టంచేశారు.
నార్సింగికి చెందిన ఓ భవన నిర్మాణ ఉద్యోగికి.. తాను పనిచేసేచోట కూలీలకు కొవిడ్ సోకినట్లు తెలిసింది. అప్పటికే కాస్త జ్వరంగా ఉండటంతో.. మాత్రలు వేసుకున్నారు. మరుసటి రోజు కొవిడ్ టీకా వేయించుకున్నారు. తెల్లవారి ఒళ్లునొప్పులు, జ్వరం పెరిగింది. టీకా కారణమంటూ భావించి విధుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి.. మృతి చెందారు. వైరస్ను సకాలంలో గుర్తించకపోవడం, సొంత నిర్ణయంతో ఆలస్యం చేయడమే కారణమంటూ మృతుడి స్నేహితులు తెలిపారు.
కూకట్పల్లి నిజాంపేటకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి వయసు 51. టీకా తీసుకున్నారు. ఒంట్లో నలతగా అనిపిస్తే సాధారణ సమస్యగా అంచనా వేసుకున్నారు! కొవిడ్ సోకినట్టుగా నిర్ధారించటంలో ఆలస్యమైంది. దీంతో మూడు రోజులు హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. 7-8 రోజుల తరువాత తీవ్రత పెరగడంతో.. ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందారు. టీకా తీసుకునే కేంద్రం వద్ద గుంపుగా చేరటం, ఎడం పాటించకపోవడంతో వైరస్ సోకినట్లు బాధితుడు తెలిపారు.
ఆ రెండుచోట్ల జరభద్రం..
పాతబస్తీ పరిధిలోని ఇద్దరు యువకులు హోటల్లో పనిచేస్తారు. కొవిడ్ సోకిందనే అనుమానంతో వారంలో రెండుసార్లు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకెళ్లి పరీక్షలకు నిలబడ్డారు. మూడు వారాల తర్వాత ఇద్దరికీ పాజిటివ్గా తేలింది. కేవలం అనుమానం నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో పరీక్ష కేంద్రాలకు వస్తూ.. ఇలా కొందరు వైరస్ బారినపడుతున్న మాట నిజమేనంటూ ప్రభుత్వ వైద్యుడొకరు తన అనుభవాన్ని వివరించారు. టీకా కోసం వచ్చినపుడు గుంపులుగా చేరడం, మాస్క్ ధరించినా వాటిని కేవలం మూతి వరకే ఉంచుకోవడం, ఊపిరి ఆడటం లేదనే ముక్కును కప్పేయకపోవటం, చిరిగిన మాస్క్లు తదితర తప్పిదాలతో.. మహమ్మారిని చేతులారా ఆహ్వానించినట్టే అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ