రైతు ఆనందంగా ఉండాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష
రాష్ట్రంలో ఇవాళ్టి వరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు...
58.07 లక్షల రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ
వెల్లడించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ్టి వరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 132.65 లక్షల ఎకరాలకుగాను రూ.6,632.74 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమచేసినట్లు చెప్పారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,31,660 మంది అన్నదాతలకు రూ.530.07 కోట్లు, కనిష్ఠంగా మేడ్చల్ జిల్లాలో 29,685 మంది రైతులకి రూ.26.82 కోట్లు వారి ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు.
నల్గొండ తర్వాత అత్యధికంగా ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రైతు బంధు అందించినట్లు మంత్రి చెప్పారు. అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని నిరంజన్రెడ్డి అన్నారు. అందుకే కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయం అందజేసినట్లు చెప్పారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో మిగిలిన రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగం తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM