Blood Donation: రక్తదానం చేయండి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆర్టీసీ యాజమాన్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది రక్తదానం చేసి ఇతరులను ఆదుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. తలసేమియా, క్యాన్సర్ రోగులు సహా గర్భిణులకు రక్తం చాలా అవసరం ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కొవిడ్ నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా రక్తం కొరత ఏర్పడటంతో చాలా మంది ఇబ్బంది పడినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.