Salt Bae: 14 మంది ఫుడ్కు రూ. 1.3 కోట్లు బిల్లు.. నెటిజన్లు ఫైర్!
అబుధాబిలోని ఓ రెస్టరెంట్లో ఫుడ్ ధరలను చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కేవలం 14 మంది తిన్న ఫుడ్కు అంత ధరా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, ఆ రెస్టారెంట్ ఎవరిది? వారు ఆర్డర్ చేసిన ఫుడ్కు ఎందుకంత ధర చెల్లించారో తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: పుట్టినరోజు, పరీక్షల్లో పాసైనా, కొత్తగా ఉద్యోగం వచ్చినా.. ఇలా జీవితంలో ప్రతి ఒక్కరి సంతోషకరమైన క్షణాలు ఉంటాయి. ఆ సమయంలో తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకునేందుకు చాలా మంది స్నేహితులు, బంధుమిత్రులకు రెస్టరెంట్లో పార్టీ ఇస్తుంటారు. ఆ సమయంలో బిల్లు కాస్త ఎక్కువైనా సంతోషంలో పర్లేదు అనుకుని కట్టేస్తాం. కానీ, అబుధాబిలోని రెస్టరెంట్లో ఓ వ్యక్తి ఇచ్చిన పార్టీకి అయిన బిల్ చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సాల్ట్ బేగా పాపులర్ అయిన ప్రముఖ చెఫ్ నుస్రత్ గోక్సెకు చెందిన రెస్టరెంట్లో 14 మందికి ఫుడ్ ఆర్డర్ చేసినట్లు బిల్లో ఉంది. వారు, ఆహారంతోపాటు వైన్ కూడా ఆర్డర్ చేశారు. వాటిలో అత్యంత పాపులర్ బోర్డియక్స్, బక్లావా వైన్, 24 క్యారెట్ గోల్డ్తో కోటింగ్ చేసిన స్టీక్ ఫుడ్ (ఒక రకమైన మాంసం వంటకం)తోపాటు ఇతర వంటకాలు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి 6,15,065 దిర్హామ్ల అయింది. అంటే, మన కరెన్సీలో సుమారు ₹ 1.3 కోట్లు. ఇందులో ఎక్కువ మొత్తం వైన్కు, స్టీక్కు చెల్లించారు.
ఈ బిల్లును నుస్రత్ గోక్సె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో బిల్లు చూసి నెటిజన్లు ఫుడ్, వైన్ ధరలపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ డబ్బుతో ఓ గ్రామానికి సహాయం చేయొచ్చు’, ‘నీ రెస్టరెంట్ కేవలం సంపన్నుల కోసమేనా?, సామాన్యులకు కాదా?’, ‘వైన్, మాంసానికి ఇంత ధరా? వాటినేమైనా అంతరిక్షం నుంచి తెచ్చావా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో నుస్రత్కు చెందిన లండన్ రెస్టరెంట్లో ధరలు చూసి షాకైనట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్