నోటి కణాలపైనా కరోనా వైరస్ ప్రభావం!
కరోనా వైరస్ మహమ్మారి శరీరంలోని శ్వాసకోస వ్యవస్థ, రక్తనాళాలు, మూత్రపిండాలతో పాటు ఇతర అవయవాలపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిసిందే. తాజాగా నోటి కణాలపైనా కరోనా వైరస్ దాడి చేస్తుందని రుజువైంది.
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి శరీరంలోని శ్వాసకోస వ్యవస్థ, రక్తనాళాలు, మూత్రపిండాలతో పాటు ఇతర అవయవాలపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిసిందే. తాజాగా నోటి కణాలపైనా కరోనా వైరస్ దాడి చేస్తుందని రుజువైంది. నోటిలో కరోనా వైరస్ ప్రభావంపై అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
కొవిడ్ రోగుల్లో వాసన, రుచిని కోల్పోవడం, ఒక్కోసారి పొక్కులు రావడం వంటి లక్షణాలను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా పాజిటివ్ వచ్చిన రోగుల లాలాజలంలో అధిక మొత్తంలో కరోనాకు కారణమయ్యే సార్స్-కోవ్-2 ఉంటుందని తెలిసింది. దీంతో ఇతర అవయవాలకు వైరస్ను వ్యాపించడంలో నోటిలోని లాలాజలం కూడా కారణమవుతున్నట్లు నిపుణులు అనుమానించారు. అంతేకాకుండా నోటి కణాలపై ఈ వైరస్ దాడి చేస్తుందని గమనించారు. దీనిని నిర్ధారించుకునేందుకు అమెరికాలోని జాతీయ ఆరోగ్య కేంద్రం (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్), యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు.
దగ్గు, శ్వాసకోశ లక్షణాలు లేనివారిలో నోటిలో ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందనే విషయంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం కొవిడ్ పాజిటివ్ రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించారు. వీటిని ఆరోగ్యవంతులైన వారి నుంచి సేకరించిన నోటి నమూనాల్లోని కణాలతో పోల్చి చూశారు. వీటి ద్వారా నోటిలోని కణాలు కూడా సార్స్-కోవ్-2 బారినపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని గుర్తించారు. వీటిని నిర్ధారించుకునేందుకు చనిపోయిన కొవిడ్ రోగుల నమూనాలను సేకరించి విశ్లేషించారు. తద్వారా నోటి కణాలపై వైరస్ ప్రభావాన్ని స్పష్టంగా గమనించారు. అంతేకాకుండా వైరస్ అధికంగా ఉన్న లాలాజలాన్ని మింగినా, లేదా అటువంటి కణాలను పీల్చుకున్నా కూడా గొంతు, ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు వైరస్ వ్యాప్తించే అవకాశాలూ ఉన్నాయని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ కెవిన్ ఎం బెయార్డ్ వెల్లడించారు. అయితే, ఈ అధ్యయనం కొన్ని నమూనాలను పరిగణలోకి తీసుకొని చేసిందేనని.. వైరస్ వ్యాప్తికి నోటి కణాలు కారణమని నిర్ధారించుకునేందుకు విస్తృత పరిశోధన అవసరమని బెయార్డ్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్