నాలుగైదు రోజులు వర్షాలే!
గత రెండు, మూడు రోజుల కిందట వరకూ సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. వరుసగా
న్యూదిల్లీ: గత రెండు, మూడు రోజుల కిందట వరకూ సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. వరుసగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళతో పాటు దక్షిణ కర్ణాటక, తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో ఒకటి రెండు ప్రదేశాల్లో రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 14వ తేదీన మధ్య తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా గంటకు 30నుంచి 40కిమీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇంటీరియర్ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 1.5 కి.మీ. దూరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ కొంకణ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్లో చిరు జల్లులు
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా పడింది. సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, సనత్ నగర్, ప్యారడైజ్, అల్వాల్, బోయిన్ పల్లి, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం కొద్ది పాటి వర్షం పడింది. దీంతో నగరంలో వాతావరణం చల్లబడింది. హుస్సేన్ సాగర్ తీరం ఆహ్లాదకరంగా మారింది. పలువురు సాగర్ పరిసరాల్లోని ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్