Gender Equality Run: హైదరాబాద్లో ఉత్సాహంగా షీ టీమ్స్ 5కే, 2కే రన్
నగరంలోని షీ టీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లో 5కె, 2కె రన్ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, నగర సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్: నగరంలోని షీ టీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లో 5కే, 2కే రన్లను ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, నగర సీపీ సీవీ ఆనంద్, షీ టీమ్స్ ఐజీ స్వాతి లక్రా తదితరులు హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు దోహదపడుతున్నాయని చెప్పారు.
షీ టీమ్స్ ఏర్పాటుతో మహిళలు ఆపదలో ఉన్న సమయాల్లో నిమిషాల్లోనే వారికి సాయం అందుతోందన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా లోకానికి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5కే రన్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్బండ్ పైనున్న లేపాక్షి వరకు సాగి, తిరిగి ప్రారంభమైన చోటే ముగిసింది. 2కే రన్ నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగింది. ఈ రన్లో పాల్గొన్న వారికి అవార్డులు, మెడల్స్ ప్రదానం చేశారు.
ఆసక్తిగా దుర్గం చెరువు రన్- 2022
హైదరాబాద్లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద నుంచి ఈ ఉదయం దుర్గం చెరువు రన్- 2022 నిర్వహించారు. ఈ రన్లో యువతీ, యువకులు పాల్గొన్నారు. ఆదివారం కావడంతో రెండో విడత దుర్గం చెరువు రన్పై యువతతో పాటు మరికొందరు ఆసక్తి కనబరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు