AP news: పోలవరం పునరావాస బిల్లులు ఆపడం లేదు: షెకావత్
పోలవరం ప్రాజెక్టు పునరావాసం వివరాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. లోక్ సభలో ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర
దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పునరావాసం వివరాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. లోక్ సభలో ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.‘‘పునరావాస వివరాలను ఏపీ అందించింది. పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,06,006 ఉన్నాయి. వారిలో ఇప్పటి వరకు 4,283 కుటుంబాలకే పునరావాస సాయం అందింది. ప్రాజెక్టు పునరావాస ఖర్చును 2014 నుంచి తిరిగి చెల్లిస్తున్నాం. ఏపీ నుంచి వచ్చిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. పీపీఏ, సీడబ్ల్యూసీ తనిఖీ తర్వాత బిల్లులు చెల్లిస్తున్నాం. భూసేకరణ, పునరావాసం కింద రూ.11,181 కోట్లు చెల్లించాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల పనులకు గుత్తేదారులు రావట్లేదు. కొన్ని పనులకు ఎన్ని సార్లు బిడ్లు ఆహ్వానించినా టెండర్లు రావట్లేదు’’ అని షెకావత్ వెల్లడించారు.
అనుమతుల్లేని ప్రాజెక్టులు ఆపాల్సిందే
కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులపై గెజిట్ వివరాలను కేంద్రం వెల్లడించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై నల్గొండ ఎంపీ ఉత్తమ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిచ్చారు. కృష్ణా నదిపై అనుమతులు లేని ప్రాజెక్టులు ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరు నెలల్లో అనుమతులు తెచ్చుకోలేకపోతే నిర్వహణ ఆపాలని అన్నారు. గత నెలలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఇదే విషయం స్పష్టం చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..