Telangana News: ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల

తెలంగాణలో ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది.......

Updated : 12 Aug 2022 21:57 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ని www.tslprb.in లో చూడొచ్చని తెలిపింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 15 వరకు స్వీకరిస్తామని పేర్కొంది.

రాష్ట్రంలో 544 ఎస్‌ఐ పోస్టుల కోసం ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్ విడుదల కాగా.. 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 7న జరిగిన ప్రాథమిక పరీక్షకు 91.32 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 2,25,759 మంది పరీక్ష రాసినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.

‘కీ’ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని