Simhachalam temple: సింహాచలం ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పచ్చదనానికి గాను ఈ గుర్తింపు దక్కింది...

Updated : 11 Sep 2021 16:19 IST

విశాఖ: విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పచ్చదనానికి గాను ఈ గుర్తింపు దక్కింది. ఈ మేరకు ఆలయ ఈవో సూర్యకళకు మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఐఎస్‌వో ధ్రువపత్రం అందజేశారు. కేంద్ర ప్రసాదం పథకం కింద సింహాద్రి అప్పన్న ఆలయానికి రూ.53కోట్లు వచ్చినట్టు ఈవో తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని