Andhra News: ఛైర్మన్కు తెలియకుండా సభ్యుల ప్రమాణ స్వీకారమా?: అశోక్గజపతిరాజు
సింహాద్రి అప్పన్న ఆలయ ట్రస్ట్బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. రెండోసారి ట్రస్ట్బోర్డు సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేసిన సభ్యులు తనకు తెలియకుండా ఏవిధంగా
విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న ఆలయ ట్రస్ట్బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. రెండోసారి ట్రస్ట్బోర్డు సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేసిన సభ్యులు తనకు తెలియకుండా ఏవిధంగా ప్రమాణం చేస్తారని బోర్డు ఛైర్మన్ అశోక్గజపతిరాజు లీగల్ ఒపీనియన్కు లేఖ రాయడం దుమారం రేపింది. సమావేశంలో ఈవో మాట్లాడుతూ.. తాను ఉద్దేశపూర్వకంగా చేసిందికాదని, ఆ సమయంలో స్వామివారి కల్యాణం, చందనోత్సవం ఉన్న కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చిందని వివరించారు. ఈ సమావేశంలో మొత్తం 46 అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను సభ్యులతో పాటు ఛైర్మన్ అశోక్గజపతిరాజు ఆమోదించారు. సమావేశం అనంతరం అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ... విద్యుత్ బస్సులను సింహగిరిపైకి నడపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని తెలిపామన్నారు. తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సుల మాదిరిగానే ఇక్కడ కూడా బస్సులు నడపాలని నిర్ణయించామన్నారు. గోశాలలో సోలార్ పవర్ప్లాంట్ ఉందని, దాని ద్వారా విద్యుత్ వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్