Eluru: కూలిన బస్టాండ్‌ స్లాబ్‌.. ఐదుగురు ప్రయాణికులకు గాయాలు

ఏలూరు పాత బస్టాండ్‌ స్లాబ్‌ కొంతభాగం కూలి ఆరుగురి ప్రయాణికులు గాయపడ్డారు.

Updated : 15 May 2023 19:18 IST

ఏలూరు: ఏలూరు పాత బస్టాండ్‌లో పైకప్పు కొంతభాగం కూలిపోయి ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్టాండ్‌లోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారమ్‌ వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఆర్టీసీ అధికారులు దగ్గురుండి వైద్యం చేయిస్తున్నారు. పూర్తిగా పాడైన పాత బస్టాండ్ ప్లాట్ ఫామ్ స్లాబ్‌లకు పీఓపీతో హంగులు అద్దారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని