Nalgonda: కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలలో అస్థిపంజరం కలకలం

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలలో అస్థిపంజరం బయటపడటం కలకలం రేపింది.

Published : 06 Jan 2022 01:52 IST

పెద్దవూర: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలలో అస్థిపంజరం బయటపడటం కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో ఉన్న గుంతలను పూడ్చేందుకు ట్రాక్టర్లతో మట్టిని పోశారు. అందులో అస్థిపంజరం కనిపించడంతో చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేశారు. దీంతో పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి  తీసివేయించడంతో తల్లిదండ్రులు శాంతించారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని