ap news: ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ను మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం
అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ను మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ను కృష్ణా జిల్లా కలెక్టర్గా, ఎల్.ఎస్ బాలాజీరావును శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్గా గంధం చంద్రుడు నియమితులయ్యారు. పాడేరు ఐటీడీఏ పీవోగా గోపాలకృష్ణ రోణంకి, ప్రకాశం జిల్లా జేసీగా (హౌసింగ్) కె.ఎస్. విశ్వనాథన్, కడప జిల్లా జేసీగా (హౌసింగ్) ధ్యానచంద్ర, తూర్పుగోదావరి జిల్లా జేసీగా ( హౌసింగ్) జాహ్నవి, కర్నూలు జిల్లా జేసీగా ( హౌసింగ్) ఎన్ మౌర్య, కృష్ణా జిల్లా జేసీగా ( హౌసింగ్) ఉపుర్ అజయ్కుమార్, గుంటూరు జిల్లా జేసీగా (హౌసింగ్) అనుపమ అంజలి, నెల్లూరు జిల్లా జేసీగా (హౌసింగ్) విదేహ కరె, చిత్తూరు జిల్లా జేసీగా (హౌసింగ్) ఎస్. వెంకటేశ్వర్ నియమితులయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు