Ear: చెవిలో ఏదైనా పడిందా..? ఇలా చేసి చూడండి
చెవిలో ఏదైనా పడితే ఆ శబ్దం అంతుచిక్కని నరకాన్ని చూపిస్తుంది. విపరీత శబ్దంతో పాటు నొప్పి కూడా భయంకరంగా ఉంటుంది. ఏ పని చేయలేం..ఎటూ పాలుపోదు. ఇక చిన్నారులైతే చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఏమవుతుందో తెలియక బాగా ఏడుస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: చెవిలో ఏదైనా పడితే ఆ ఇబ్బంది తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి భరించలేనంత నొప్పి కూడా వస్తుంది. ఏ పని చేయలేం. ఇక చిన్నారులైతే ఏమైందో తెలియక బాగా ఏడుస్తుంటారు.
చిన్నారులు చదువుతున్నప్పుడో.. రాస్తున్నపుడో పెన్ను, బలపం, పిన్నీసు లాంటి వాటిని ఏదో ఒకటి చెవిలో పెట్టుకుంటారు. ఆ సమయంలో పెన్ను మూతలు, బలపం ముక్కలు చెవిలో పడిపోతాయి. దాన్ని తీసే క్రమంలో కాస్త గట్టిగా అంటే లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. పిల్లలు వాటిని గట్టిగా నెట్టినపుడు రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక నిద్ర పోతున్న సమయంలో ఒక్కోసారి చీమలు, పురుగులు చెవిలోకి వెళ్తాయి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ ఉంటుంది. దాన్ని తీయడానికి చేసే ప్రయత్నంలో చెవి లోపలి భాగం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ఏం చేయాలో నిపుణులు పలు సూచనలు చేశారు.
* ఇలాంటి పరిస్థితుల్లో తలను సాధ్యమయినంత వరకు కిందికి వంచి ఉంచాలి. బలపం, పుల్లలు, పెన్సిల్, పెన్నుల మూతలు కనిపిస్తే జాగ్రత్తగా తీయడానికి వీలుంటేనే తీయాలి.
* చీమలు, పురుగులు చెవి లోపలికి వెళ్లి కదలాడుతుంటే రెండు చుక్కల ఆలీవ్ నూనె, బేబీ ఆయిల్ను గానీ పోయాలి. ఇలా చేయడంతో అవి చనిపోతాయి. వేరే వస్తువులుంటే మాత్రం ఆయిల్ పోయొద్దు.
* చెవిలోపల ఏవైనా ఉంటే మాత్రం తీయకుండా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి