Andhra News: తల్లి చనిపోయిందని తెలియక.. 4 రోజులుగా స్కూలుకెళ్లొస్తూ..

తిరుపతి విద్యానగర్‌ కాలనీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు

Updated : 12 Mar 2022 09:33 IST

తిరుపతి: తిరుపతి విద్యానగర్‌ కాలనీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమ్మ రాజ్యలక్ష్మి నిద్ర పోతోందని పదేళ్ల కుమారుడు శ్యామ్‌ కిషోర్‌ భావించినట్లు సమాచారం. కుటుంబ కలహాలతో రాజ్యలక్ష్మి భర్తకు దూరంగా కుమారుడితో కలిసి విద్యానగర్‌ కాలనీలో ఉంటోంది. ప్రైవేట్‌ కళాశాలలో ఆమె అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8న ఇంట్లో కిందపడిన రాజ్యలక్ష్మి మృతిచెందారు. కాగా అమ్మ నిద్ర పోతోందని శ్యామ్ కిషోర్‌ నాలుగు రోజులుగా పాఠశాలకు వెళ్లొస్తున్నాడు.

ఇంట్లో ఉన్న తినుబండారాలతో నాలుగు రోజులు గడిపడంతో పాటు మంచం పక్కన తల్లి మృతదేహంతోనే పడుకున్నాడు. ఈ ఉదయం ఇంట్లో దుర్వాసన వస్తోందని  శ్యామ్‌ కిషోర్‌ మేనమామ దుర్గాప్రసాద్‌కు తెలిపాడు. దీంతో ఇంట్లో రాజ్యలక్ష్మి మృతదేహం చూసిన దుర్గా ప్రసాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శ్యామ్‌ కిషోర్‌ మానసిక స్థితి సరిగా లేదని దుర్గాప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని