CM Jagan Tour: సీఎం తిరువూరు పర్యటన.. జగన్ ఫొటోతో పోలీసులకూ ప్రత్యేక గుర్తింపుకార్డులు
జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరగనుంది.
తిరువూరు: జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్యఅతిథిగా హాజరై నిధులను విడుదల చేయనున్నారు. అయితే సీఎం బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులకూ ఈసారి ప్రత్యేక గుర్తింపుకార్డులు జారీ చేశారు. జగన్ ఫొటోతో ఆ కార్డులు ఇచ్చారు. బందోబస్తు విధులకు వచ్చే పోలీసులు తప్పకుండా ఆ గుర్తింపుకార్డు ధరించాలని అధికారులు ఆదేశించారు. మీడియా చిత్రీకరిస్తుండటంతో కార్డును వెనక్కితిప్పి ఉంచుకోవాలని సిబ్బందికి సూచిస్తున్నారు. సీఎం ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డులు మెడలో ధరించాలనడంపై పలువురు పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులకు అవస్థలు తప్పవు..
తిరువూరు పర్యటనకు సీఎం జగన్ హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి చేరుకోనున్నారు. పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి వస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. జగదల్పుర్ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఎనిమిది గంటలు వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. నిత్యం జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలకు ఆదివారం అవస్థలు తప్పవు.
మైలవరం వైపు నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను చీమలపాడు సెంటర్ మీదుగా గంపలగూడెం, కల్లూరు వైపు, మైలవరం నుంచి భద్రాచలం వెళ్లే వాహనాలను ఎ.కొండూరు అడ్డరోడ్డు నుంచి విస్సన్నపేట మీదుగా సత్తుపల్లి వైపు, భద్రాచలం నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను కల్లూరు, చీమలపాడు వైపు మళ్లిస్తున్నారు. దీనివల్ల అరగంటలో తిరువూరు దాటి వెళ్లే వాహనదారులు చుట్టూ తిరిగి రెండు గంటలు ప్రయాణించాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్